ఇంటింటికి నీటి సరఫరా : మేయర్

ఇంటింటికి నీటి సరఫరా : మేయర్
కర్నూలు మున్సిపల్ , (PAWANIJAM NEWS) :
కర్నూలు నగరంలో ఇంటింటికి నీటిని సర ఫరా చేసేందుకు చర్యలు చేప డుతున్నామని నగర మేయర్ బి.ఎల్లా రామయ్య తెలిపారు. మంగళవారం 29వ వార్డులో విజ్జి నగర్లో రూ.10 లక్షల వ్యయంతో 550 మీటర్ల పైప్ లైన్ తో పాటు వి.వి.యస్. ఫంక్షన్ హాల్ రోడ్డుకు రూ.10 లక్షల వ్యయంతో 280 మీటర్ల డబ్లు.బి.యమ్. రోడ్డు నిర్మాణా నికి మేయర్, ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్ రెడ్డి లు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ విస్తరిస్తున్న నగర పరిధిలో ఇంటింటికీ నీటి అందించడమే ధ్యేయంగా ప్రణా ళికలు సిద్ధం చేస్తున్నామ న్నారు. ప్రజలు కూడా ఇళ్ళు తీసుకునే ముందు ఆ లే ఔట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూసుకొనే కొనాలని విజ్ఞప్తి చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సరైన సౌకర్యా లు కల్పించకముందే అమ్మ కాలు చేస్తున్నారన్నారు.దీంతో నగర పాలక సంస్థకు అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.



