ANDHRA PRADESHBREAKING NEWSBUSINESSHEALTHMOVIESPOLITICSSPORTSSTATETELANGANAWORLD
కరోనా హాట్స్పాట్గా ఐఐటీ మద్రాస్.. మరో 25 మందికి పాజిటివ్

దేశంలో మూడు నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ సహా యూపీ, కేరళ, హరియాణాల్లో పాజిటివిటీ రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. అలాగే, విద్యా సంస్థల్లోనూ కేసులు బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఐఐటీ మద్రాస్లో పలువురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నాలుగు రోజుల్లోనే అక్కడ కేసులు అర్ధ సెంచరీ దాటేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి రెండు రోజుల అక్కడకు వెళ్లి పరిస్థితి గమనించారు.
కరోనా హాట్స్పాట్గా మారుతోంది. గురువారం 12, శుక్రవారం 18 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. శనివారం మరో 25 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అక్కడ మూడు రోజుల్లో 50కిపైగా కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్ను పెంచడంతో మరిన్ని కేసులు బయటపడతాయని అధికారులు అంటున్నారు. ఐఐటీ క్యాంపస్లో పలువురు విద్యార్థులకు జ్వరం, జలుబు లక్షణాలు బయటపడటంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ముగ్గురికి కరోనా ఉన్నట్లు బుధవారం తేలింది.
వారితో సన్నిహితంగా ఉన్న 18 మందికి గురువారం పరీక్షలు చేయగా 12 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో మరికొందర్ని పరీక్షించగా శుక్రవారం 18 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే, తాజాగా శనివారం 25 మందికి వైరస్ బయటపడింది. మొత్తం 55 మంది బాధితులను గుర్తించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులను క్యాంపస్లోనే ఐసోలేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ ఐఐటీఎం ప్రాంగణానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
ఇప్పటి వరకూ ఐఐటీ మద్రాసు క్యాంపస్లో 1,420 మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. వీరిలో 55 మందికి పాజిివ్ వచ్చిందన్నారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, వారి ఆరోగ్య నిలకడగా ఉందన్నారు. అంతేకాదు, తమిళనాడు ‘XE’ వేరియంట్ కేసు ఇప్పటి దాకా బయటపడలేదని రాధాకృష్ణన్ చెప్పారు.
ఇక, తమిళనాడులో శుక్రవారం 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా పెరిగాయి. ఎటువంటి కరోనా మరణం నమోదుకాలేదు. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితులు 34,53,447కు పెరిగింది. ఇప్పటి వరకూ 38,025 మంది కరోనాకు బలయ్యారు.



